News March 26, 2025

దుబ్బాక: గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ దుబ్బాక ఎంపీడీవో భాస్కర శర్మతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు మంచి ఆహారం అందించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.

Similar News

News December 21, 2025

వాట్సాప్‌లో కొత్త మోసం.. జాగ్రత్త: సజ్జనార్

image

TG: వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ పేరిట కొత్త స్కామ్ జరుగుతోందని HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ‘Hey.. మీ ఫొటో చూశారా? అంటూ లింక్‌ వస్తే క్లిక్‌ చేయొద్దు. క్లిక్ చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్టవుతుంది. మీ పర్సనల్ డేటా చూసి మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసం చేస్తారు. WhatsApp సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను చెక్ చేసి తెలియని డివైజ్‌లు ఉంటే రిమూవ్‌ చేయండి’ అని ట్వీట్ చేశారు.

News December 21, 2025

TDP జిల్లా అధ్యక్షులు వీరే! 1/2

image

AP: TDP జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించారు. * తిరుపతి – పనబాక లక్ష్మి * చిత్తూరు – షణ్ముగ రెడ్డి * అన్నమయ్య – సుగవాసి ప్రసాద్ * ప్రకాశం – ఉగ్ర నరసింహా రెడ్డి * అనంతపురం – పూల నాగరాజు * శ్రీ సత్యసాయి – ఎంఎస్ రాజు * నంద్యాల – గౌరు చరితా రెడ్డి * విజయనగరం – కిమిడి నాగార్జున * ఏలూరు – బడేటి రాధాకృష్ణ * కాకినాడ – జ్యోతుల నవీన్ * బాపట్ల – సలగల రాజశేఖర్ * పల్నాడు – షేక్ జానే సైదా

News December 21, 2025

శ్రీ సత్యసాయి: ఒకే నేతకు నాలుగు పదవులు

image

TDPలో మడకశిర MLA MS రాజుకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయనకు 4 కీలక పదవులు దక్కాయి. ఇప్పటికే మడకశిర MLAగా, TTD బోర్డు సభ్యుడిగా, TDP రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను తాజాగా సత్యసాయి జిల్లా TDP అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. యువగళం పాదయాత్ర నుంచి పార్టీ బలోపేతానికి చేసిన సేవలకే ఈ గుర్తింపు లభించిందని మద్దతుదారులు చెబుతున్నారు.