News March 29, 2024

దుబ్బాక: గొలుసుతో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ పిట్టల వాడకు చెందిన జయరాం(35) ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో వాసానికి గొలుసుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 8, 2024

సంగారెడ్డి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.

News July 8, 2024

పటాన్‌చెరు: ED పేరుతో.. రూ.3లక్షలు స్వాహా

image

పటాన్‌చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News July 8, 2024

SRD: ఇన్స్పైర్ మనక్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ కార్యక్రమం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిధారెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతి పాఠశాలకు పంపే ప్రత్యెక లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని, సెప్టెంబర్ 15 చివరి తేదని తెలిపారు.