News April 16, 2025
దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
కడప జిల్లా వృద్ధేలక్ష్యం: కలెక్టర్ శ్రీధర్

ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే జిల్లాలో మంచి వృద్ధి సాధించామని, రాష్ట్ర స్థూలోత్పత్తిలో 17.33% వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కడప కలెక్టర్ శ్రీధర్ CM సమావేశంలో వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నాలుగవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు.
News September 17, 2025
మైథాలజీ క్విజ్ – 8

1. రామాయణంలో మైథిలి అంటే ఎవరు?
2. కురుక్షేత్రంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ఎవరు?
3. ‘పుతనా’ రాక్షసిని చంపింది ఎవరు?
4. విష్ణువు శయనించే పాము పేరు ఏమిటి?
5. ‘బృహదీశ్వర ఆలయం’ ఎక్కడ ఉంది?
వీటి ఆన్సర్స్ మైథాలజీ క్విజ్-9 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17714352>>మైథాలజీ క్విజ్ – 7<<>> జవాబులు: 1.జయవిజయులు 2.సరయు 3.దేవవ్రతుడు 4.ఉత్తరాఖండ్ 5.వినాయక చవితి
News September 17, 2025
సామాన్యుల నాయకుడు బద్దం ఎల్లా రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లా రెడ్డి నిజాం నవాబుకు వ్యతిరేకంగా KNR జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. రైతులు, సామాన్య ప్రజలను సంఘటితం చేసి వారికి నాయకత్వం వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ఎదిరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. సాయుధ పోరాటంలో 3 సం.రాలు జైలు శిక్ష అనుభవించారు.