News November 4, 2025

దుర్గగుడి చైర్మన్ ఫ్రస్ట్రేషన్..!

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దుర్గగుడి ఉద్యోగులపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తనకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని, గౌరవం ఇవ్వట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు లేఖ కూడా రాసినట్లు ఆయన చెబుతున్నారట. దీంతో దుర్గ గుడిలో చైర్మన్ Vs ఉద్యోగుల మధ్య వార్ నడుస్తోందనే చర్చ జోరుగా జరుగుతోంది.

Similar News

News November 4, 2025

VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

image

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.

News November 4, 2025

వరంగల్: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. ఉమ్మడి WGLలో 21 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి. SHARE IT

News November 4, 2025

NGKL: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు:DMHO

image

ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్స్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ABAS అటెండెన్స్ అందరూ టైంలో పెట్టాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని కోరారు.