News March 5, 2025
దువ్వాడ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఫిర్యాదు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు మంగళవారం కరప పోలీస్ స్టేషన్లో ఎస్సై టి.సునీతకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కరప జనసేన నేతలు భోగిరెడ్డి కొండబాబు, భోగిరెడ్డి గంగాధర్, నున్న గణేష్ నాయుడు, పప్పులు మల్లి బాబు, గోన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2025
శ్రీకాకుళం: ప్రముఖ లలిత సంగీత కళాకారుడి మృతి

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంగీత కళాకారుడు, గురువు బండారు చిట్టి బాబు బుధవారం మరణించారు. లలిత సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేసి ఎంతో మంది శిష్యులకు సంగీత పాఠాలు నేర్పిన చిట్టిబాబు మరణం పట్ల జిల్లాలో సంగీత కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేస్తూ మత సామరస్య గీతాలు కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత అని పలువురు తెలిపారు.
News March 5, 2025
మలేరియా రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి: DM&HO

మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, సీజనల్, ఇతర అంటువ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను రాష్ట్ర అదనపు సంచాలకులు (మలేరియా) డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, DM&HO డా టివి బాల మురళీకృష్ణ పిలుపునిచ్చారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం జరిగింది. వ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 5, 2025
ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తాం: అచ్చెన్న

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అర్హత కలిగిన రైతులకు సహాయాన్ని అందజేస్తామని ఆయన అన్నారు.