News February 23, 2025

దువ్వాడ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

image

దువ్వాడ మీదుగా సంబల్ పూర్ – ఈరోడ్ (08311/12), భువనేశ్వర్ – యస్వంత్ పూర్ (02811/12)రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఈరోడ్, మార్చ్ 1నుంచి ఏప్రిల్ 26వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ – యస్వంత్ పూర్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News February 23, 2025

గాజువాకలో యువకుడు సూసైడ్?

image

గాజువాక సమీపంలో గల అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. విశాఖ డైరీ సర్వీస్ రోడ్డులోని శ్రావణి షిప్పింగ్ భవనం పక్కనే చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉంది. ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తున మృతుడు కర్రీ ప్రవీణ్‌(27)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 23, 2025

విశాఖ: యాక్సిడెంట్‌లో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

ఆనందపురం మండలంలోని గిడిజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పొడుగుపాలెంకి చెందిన బంటుబిల్లి లక్ష్మణరావు(35), గౌరీ బైక్‌పై వేమగొట్టిపాలెం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా లక్ష్మణరావు మార్గమధ్యలో మృతి చెందాడు. అతని భార్య గౌరీకి రెండు కాళ్లు విరిగిపోయాయి. 

News February 23, 2025

శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్‌లకు ప్రత్యేక బస్సులు

image

శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 26 అర్ధరాత్రి నుంచి 27 సాయంత్రం వరకు గాజువాక, కుర్మన్నపాలెం, అగనంపూడి నుంచి అప్పికొండకు.. తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్ర నగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక నుంచి ఆర్.కె.బీచ్‌కు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!