News April 15, 2025
దువ్వాడ: రైలులో ప్రసవించిన మహిళ

చర్లపల్లి నుంచి కిసాన్ గంజ్ (07046) రైల్లులో ప్రయాణిస్తున్న మహిళ ఆదివారం అర్ధరాత్రి 12:30కు దువ్వాడ సమీపంలో ప్రసవించింది. రైలులో ఉన్న జైనాబ్కు పురిటి నొప్పులు రావడంతో రైల్వే సిబ్బంది గమనించి సత్వర చర్యలు చేపట్టారు. ఆమె రైలులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తక్షణమే తర్వాత స్టేషన్లో హాస్పిటల్కి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News September 12, 2025
KGH అభివృద్ధిపై విభాగాధిపతులతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష

KGH అభివృద్ధిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్ని విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలు, వసతులపై చర్చించారు. ఆంకాలజీకి 30 మంది స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో విభాగానికి పరికరాలు, ఎండోక్రనాలజీకి మరమ్మతులు ప్రతిపాదించారు. వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
News September 12, 2025
రేపు విశాఖ రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.
News September 12, 2025
విశాఖ రానున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం విశాఖ రానున్నారు. శనివారం ఉదయం 8గంటలకు ఎయిర్ పోర్ట్కు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారు. దీనికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.