News July 29, 2024

దువ్వూరు: చల్లబసాయపల్లె డ్యామ్‌లో ముగ్గురు గల్లంతు

image

కడప జిల్లా దువ్వూరు మండలంలోని చల్లబాసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్సిడీ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతయ్యారు. ఆదివారం విహారయాత్ర కోసం వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు డ్యామ్‌లో ఈత కొడుతుండగా గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 1, 2024

కడప: ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు

image

ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.

News October 1, 2024

కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు

image

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.

News September 30, 2024

కడప: స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

కడప జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మిషన్ శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్, న్యూ రిమ్స్ కడప నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందగలరన్నారు. అర్హతల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన వారు అక్టోబర్ 10 సాయంత్రం 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.