News September 7, 2025
దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సీతంపేట వద్ద రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అతని శరీరం ముక్కలైపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ప్రమాదంలో సెల్ఫోన్ కూడా ధ్వంసమైంది. మృతుని వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 8, 2025
‘ఫోటో ట్రేడ్ ఎక్స్పో’ పోస్టర్ ఆవిష్కరణ

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్పో-2025 పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్లోని నార్సింగ్లోని ఓం కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
News September 8, 2025
రంప: ‘DRPలు తప్పనిసరిగా హాజరు కావాలి’

రంపచోడవరం, చింతూరు డివిజన్లో 11మండలాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ రేపటి నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తప్పనిసరిగా హాజరు కావాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు సోమవారం మీడియాకు తెలిపారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 9,10 తేదీల్లో వీరందరికి శిక్షణ ఉంటుందన్నారు. 11మండలాల్లో 44 మంది DRPలకు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.
News September 8, 2025
CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.