News March 29, 2024

దేవరకద్ర: రూ.8 లక్షల 40 వేలు పట్టివేత

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు మరికల్ మండలం లాల్ కోట చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర మండలం గురకొండకి చెందిన బిరప్ప రూ.8 లక్షల 40 వేలు కారులో తీసుకెళ్తుండగా సీజ్ చేసి ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత పత్రాలు వెంట ఉండాలన్నారు.

Similar News

News October 4, 2024

MBNR: సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు

image

ఓరుగల్లులో రాష్ట్రస్థాయి U-19 టోర్నీలో ఉమ్మడి MBNR జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం సెమీస్‌లో ఖమ్మం జట్టుపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ల దాటికి ఖమ్మం జట్టు 39.3 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. జిల్లా జట్టు నుంచి అబ్దుల్ రాఫె-110 పరుగులు, MD ముఖిత్ 4 వికెట్లు తీశారు.
#CONGRATULATIONS

News October 4, 2024

12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి

image

దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.

News October 4, 2024

రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.