News October 3, 2024
దేవరకొండ దాబాలో వ్యక్తి మృతి
దేవరకొండలో – డిండి రోడ్డులో గల దాబాలో పని చేసే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 3, 2024
ఒక్క క్లిక్తో.. భూ వివరాలు మన చేతుల్లో
నల్గొండ, భువనగిరితో పాటు HYD, RR, MDCL, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News October 3, 2024
నల్గొండ: కూలిన చెట్లు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే రహదారిపై చెట్లు కూలి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి..వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ 4 గంటలపాటు అంధకారంలో మునిగింది.
News October 3, 2024
యాదాద్రిలో నేటి నుంచి దేవి శరన్నానవరాత్రులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం కొండపైన గల పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో నేటి నుంచి 9రోజులపాటు దేవి శరన్నవరాత్రులను ఆలయాధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ 9 రోజులు దేవి శరన్నవరాత్రుల్లో భక్తులు రూ.1,116 చెల్లించి దేవిపూజల్లో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.