News February 25, 2026

‘దేవాదుల’ కెపాసిటీని 100TMCలకు పెంచండి: సీఎం రేవంత్

image

TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం కెపాసిటీని భవిష్యత్తులో 100 TMCలకు పెంచేందుకు కసరత్తు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38TMCల సామర్థ్యంతో 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ₹14,359Crను ఖర్చు చేశారు. దేవాదులతో హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, ములుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News March 1, 2026

మంచి మనసు చాటుకున్న విజయ్-రష్మిక

image

ఇటీవల ఏడడుగుల బంధంతో ఒక్కటైన విజయ్ – రష్మిక జంట మంచి మనసు చాటుకుంది. ఈరోజు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మిఠాయిలు పంచుతూ, ఆలయాల్లో అన్నదానం నిర్వహిస్తూ తమ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాం రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ జంట నేడు అన్నదానం నిర్వహిస్తారు. అలాగే ఏపీ, టీజీ సహా రాష్ట్రాల్లోని నగరాల్లో స్వీట్లను పంచనున్నారు.

News March 1, 2026

‘శాంతి కలుగుగాక’.. ఖమేనీ X అకౌంట్ నుంచి పోస్ట్!

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన X అకౌంట్స్‌లో ఒకదానిలో పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘అతనికి శాంతి కలుగుగాక’ అని అర్థం వచ్చే పర్షియన్‌ టెక్ట్స్‌తో పాటు ఓ యోధుడు ఖడ్గం పట్టిన ఇమేజ్ పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖమేనీ మరణ వార్తను ఉద్దేశించి చేసిందేనని.. పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇరాన్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు: ట్రంప్

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.