News September 16, 2025
దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి: రమేశ్ బాబు

కాకినాడ జిల్లాలోని దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సమావేశమయ్యారు. కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ, ఇతర ఆలయాలకు డిప్యూటేషన్పై వెళ్లేవారు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ నిధుల లావాదేవీలపై చర్చించారు.
Similar News
News September 16, 2025
MGBS మెట్రో స్టేషన్లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

దేశంలోనే పాస్పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.
News September 16, 2025
కేజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

కేజీహెచ్లో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతమైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులకు చెందిన ఆడ శిశువుకు తల వెనుక ‘జెయింట్ ఆక్సిపిటల్ మెనింజోఏన్సఫలోసిల్’ గడ్డ ఉంది. కేజీహెచ్లో డా. ప్రేమ్జిత్ రే నేతృత్వంలోని న్యూరో సర్జరీ బృందం ఆపరేషన్ చేసి, బయటకు వచ్చిన మెదడు భాగాన్ని తొలగించారు. పదివేల మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి చికిత్స విజయవంతమైందని, శిశువు కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
News September 16, 2025
నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.