News September 24, 2025
దేశంలోనే తొలిసారి TTDలో అమలు

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-లోని 25వ కంపార్ట్మెంట్ వద్ద ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారి TTD ఆందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అలిపిరి నుంచే భక్తుల రద్దీని అంచనా వేస్తారు. క్యూ లైన్లో ఎంత మంది భక్తులు ఉన్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? తదితర అంశాలను ఏఐ గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిస్టంకు సమాచారం, 3డీ మ్యాప్, ఫొటోలు అందజేస్తుంది.
Similar News
News September 24, 2025
KUలో LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు..!

కేయూలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8, 10, 14, 16, 18వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. అక్టోబర్ 9, 13, 15, 17వ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు LLB ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఇతర వివరాలకు కేయూ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
News September 24, 2025
కేయూలో LLB 3, 5 మొదటి సెమిస్టర్ పరీక్షలు..!

కేయూలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8, 10, 14, 16, 18వ తేదీల్లో మ.2 గంటల నుంచి సా.5 వరకు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. అక్టోబరు 9, 13, 15, 17వ తేదీల్లో ఉ.10 నుంచి మ. ఒంటి గంట వరకు ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఇతర వివరాలకు కేయూ వెబ్ సైట్లో చూడాలని సూచించారు.
News September 24, 2025
అక్టోబర్ 16 నుంచి కేయూ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియం త్రణాధికారి డా.ఎమీ అసీం ఇక్బాల్ మంగళవారం తెలిపారు. అక్టోబరు 16, 18, 22, 24, 27, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.