News April 5, 2025

దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్

image

ఆహార భద్రత విషయంలో దేశంలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్న బియ్యం లబ్ధిదారులు పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.

Similar News

News April 12, 2025

జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల

image

AP: 33 మందితో కూడిన PACని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

News April 12, 2025

కృష్ణా: ఒకేషనల్ కోర్సులో జిల్లా టాపర్‌గా గాయత్రి

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు. 

News April 12, 2025

IPL: రిషభ్ పంత్ మళ్లీ విఫలం

image

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్ మళ్లీ విఫలమయ్యారు. ఈసారి ఓపెనింగ్‌ స్థానంలో వచ్చినా ఆయన ఆట మారలేదు. GTతో జరుగుతున్న మ్యాచులో పంత్ 18 బంతులాడి 21 పరుగులే చేశారు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచుల్లో 0, 15, 2, 2, DNB, 21తో తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సీజన్‌లో ఆయన స్థాయికి తగ్గట్లు ఒక్క మ్యాచులో కూడా రాణించలేదు. కనీసం నెక్ట్స్ మ్యాచులోనైనా బ్యాట్ ఝుళిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

error: Content is protected !!