News December 15, 2025

దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

image

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.

Similar News

News December 16, 2025

MDK: ఓట్లకు నోట్ల వాన..!

image

పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్ల వాన కురుస్తోంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మూడో విడత రేపు (17న) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ధూళిమిట్ట మండలంలోని ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ.2 వేలకు పైనే పంపిణీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి, ఓటు వేయాలని కోరుతున్నారు. మద్యం పంపిణీ కూడా జోరుగా సాగుతుందని ఆరోపణలొస్తున్నాయి.

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.

News December 16, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

image

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.