News May 7, 2024
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది: కడియం

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీజేపీ ప్రమాదకర ధోరణిని అవలంబిస్తుందని, బీజేపీ దుర్మార్గాలను, ఆకృత్యాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కడియం అన్నారు.
Similar News
News September 12, 2025
వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 12, 2025
ఏనుమాముల మార్కెట్యార్డులో ఈవీఎంల పరిశీలన

వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs)ను జిల్లా కలెక్టర్ సత్య శారదా పరిశీలించారు. ఈ తనిఖీలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీలు, నిల్వ విధానం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. పారదర్శకతను కాపాడుతూ ఎన్నికల పక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే ఈ తనిఖీ లక్ష్యమని తెలిపారు.
News September 12, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ మండలంలో 82.9 మి.మీ, గీసుగొండ 65.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 20.5 మి.మీ, కాగా మొత్తం 267.1 మి.మీ. వర్షం పడింది.
కొన్ని మండలాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్, చెన్నారావుపేట మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.