News July 5, 2024
దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్కళ్యాణ్ పూజలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720110449044-normal-WIFI.webp)
ఉపముఖ్యమంత్రి, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిత్యయంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ సూర్యారాధన చేశారు.
Similar News
News July 8, 2024
పవన్ కళ్యాణ్కు మాటిచ్చి.. రంగంలోకి కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720419096713-normal-WIFI.webp)
సమస్యల పరిష్కారం నిమిత్తం 2 వారాలకొకసారి కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని ముందుకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ సభా వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్కు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ షాన్మోహన్ సోమవారం పిఠాపురం విచ్చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
News July 8, 2024
కాకినాడ: BJP గూటికి ఇద్దరు మాజీ కార్పొరేటర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720395854710-normal-WIFI.webp)
కాకినాడకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు గోడి సత్యవతి, గరిమెళ్ల శర్మ బీజేపీ గూటికి చేరారు. గోడి సత్యవతి భర్త వెంకట్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో BJPలో ఉన్న వీరు YCPలో చేరారు. తిరిగి ఆదివారం సొంతగూటికి రాగా.. బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి MP పురందీశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News July 8, 2024
అన్నవరం దేవస్థానానికి 2 కొత్త బస్సులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720392317510-normal-WIFI.webp)
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి 2 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులను సుమారు రూ.80 లక్షల వ్యయంతో సిద్ధం చేస్తున్నారు. భక్తులు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న బస్సులు పూర్తిస్థాయిలో సరిపోవటం లేదు. కొన్ని బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రెండు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నారు.