News March 20, 2025

దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.

Similar News

News March 20, 2025

109 కేసుల్లో 73 ఛేదించాం: విశాఖ సీపీ

image

విశాఖ సిటీలో ఫిబ్రవరి నెలలో నమోదైన 109 చోరీ కేసుల్లో 73 ఛేదించామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. రూ.33.21లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.60లక్షల విలువైన 419 ఫోన్లను రికవరీ చేశామన్నారు. 660.655 గ్రాముల బంగారం, 2.08 గ్రా. వెండి, రూ.2,73,575 నగదు,14 బైకులు, 2ల్యాప్‌టాప్‌లు, 2గేదెలు, 3లారీ బ్యాటరీలు, 57 సెంట్రింగ్ షీట్లను బాధితులకు అందజేశారు. మిగతా కేసులు ఛేదిస్తున్నామన్నారు.

News March 20, 2025

నితిన్ గడ్కరీతో విశాఖ ఎంపీ శ్రీభరత్ భేటీ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విశాఖ ఎంపీ శ్రీభరత్ గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేయాలని.. భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ-ఖరగ్‌పూర్ కారిడార్‌పై చర్చించారు. ఈ రోడ్లు నిర్మాణం అయితే ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కోరారు.

News March 20, 2025

విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

image

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!