News February 10, 2025
దొంగతనాలకు పాల్పడిన 5గురు అరెస్ట్

ఏలూరు, పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన 5గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 కేజీల వెండి,186 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, కైకలూరు సీఐ కృష్ణ 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Similar News
News December 18, 2025
సిరిసిల్ల: 4 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అధికంగా గెలిచారు. ఎల్లారెడ్డిపేటలో 11, ముస్తాబాద్లో 13, గంభీరావుపేటలో 11, వీర్నపల్లిలో 8, మొత్తం 43 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 17, ఒక సీపీఐ అభ్యర్థి గెలిచారు.
News December 18, 2025
KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 18, 2025
పాలమూరు పంచాయతీ పోరు: కాంగ్రెస్ హవా

పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ముగిసిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 77 మండలాలలోని 1,678 సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 964 చోట్ల విజయం సాధించారు. BRS బలపరిచిన అభ్యర్థులు 482స్థానాల్లో గెలవగా.. BJP 75 పీఠాలను దక్కించుకుంది. మరో 150చోట్ల స్వతంత్రులు, ఇతరులు విజేతలయ్యారు. మొత్తం 15,068 వార్డు స్థానాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే నెగ్గారు.


