News October 11, 2025

దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది: తుమ్మల

image

దేశంలో గత ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. దొంగ ఓట్లతోనే మోదీ, అమిత్ షా బృందం అధికారంలోకి వచ్చిందన్నారు. శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓట్ చోరీ సంతకాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Similar News

News October 12, 2025

కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి: పవన్

image

AP: పకడ్బందీ ప్రణాళికతో కాకినాడ(D) తీర ప్రాంత కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. ‘ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి. 100రోజుల ప్రణాళికతో జాలర్ల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించండి. మనం తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశానికి మోడల్ కావాలి. వ్యర్థాలను శుద్ధి ప్రక్రియలో అధునాతన సాంకేతికతను పరిశ్రమలు వినియోగించాలి’ అని తెలిపారు.

News October 12, 2025

HYD: DON’T MISS.. రేపు ఉ.7 గంటలకు పోలియో చుక్కలు

image

HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా అనేక చోట్ల అక్టోబర్ 12న ఉదయం 7 గంటలకు పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం అవుతుందని డాక్టర్ సౌశీల్య తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. 0-5 ఏళ్ల వయసు ఉన్న వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అక్టోబర్ 13వ తేదీన హౌస్ టు హౌస్ ప్రోగ్రాం నిర్వహిస్తారు.

News October 12, 2025

VKB: Way2News వరుస కథనాలు.. అధికారుల స్పందన

image

వికారాబాద్ పట్టణంలో కుక్కల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. శనివారం మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టి జంతు నియంత్రణ కేంద్రానికి తరలించారు. కుక్కల సంఖ్య తగ్గించేలా వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీధి కుక్కల స్వైర విహారం‌పై Way2News‌లో వరుస కథనాలు పబ్లీష్ అయ్యాయి.