News April 29, 2024

దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారు: బాజిరెడ్డి

image

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ BRS అభ్యర్థి గోవర్ధన్ అన్నారు. ఆదివారం రాత్రి మోర్తాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీ నిరుపేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రేవంత్ రెడ్డి ఝూటాకోర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఆశీర్వదించి మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.

Similar News

News September 12, 2025

ఈనెల 10 నుంచి రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

image

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు పోరాట విశిష్టతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు.

News September 11, 2025

NZB: కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు

image

నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలన్నారు. ఎవరైనా IDOC ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News September 11, 2025

NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేటలోని సిరన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ పూర్తి అయినట్లు చెప్పారు.