News April 7, 2025
దొనకొండ: నీటి కుంటలో పడి బాలుడి మృతి

దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News April 8, 2025
ఒంగోలు: ట్రైన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఒంగోలు రైల్వే స్టేషన్ ఆగిన హౌరా జనరల్ కోచ్లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రయాణికులు స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిశీలించారు. మృతుని వయస్సు 35 – 40 ఏళ్లు ఉంటాయని, మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని జీఆర్పీ ఎస్సై. కే మధుసూదన్ రావు సూచించారు.
News April 8, 2025
టంగుటూరు : బీటెక్ చదువుతూ.. గుట్టుగా గంజాయి అమ్మకం

టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరు పరిధిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి స్థానికంగా ఉన్న యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News April 8, 2025
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో నలుగురు యువకులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. యువత చెడు మార్గాలను వదిలేయాలని సూచించారు.