News January 24, 2025
దోమకొండ గడికోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గడికోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు.ప్రియాంక చోప్రాకు గడికోట సభ్యులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రియాంక చోప్రా గతంలో హీరో రాంచరణ్ తేజ్తో కలిసి జంజీర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఈ దేవాలయం ప్రత్యేకతను ప్రియాంకకు వివరించగా..తాజాగా ఆమె ఈ కోటను దర్శించుకున్నారు.
Similar News
News November 10, 2025
ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

AP: హైస్కూల్ ప్లస్లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
News November 10, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ANM దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన<<18244517>> రోడ్డు ప్రమాదం<<>>లో ఏఎన్ఎం దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మం. గంగాపురం వాసి ఎర్రోళ్ల నర్సయ్య.. భార్య సునీత(30), కుమార్తె కీర్తనతో కలిసి బైక్పై చేర్యాల నుంచి వస్తున్నారు. లేనిన్నగర్ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో సునీత స్పాట్లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి బిడ్డను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సునీత శనిగరం PHCలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది.
News November 10, 2025
‘వనజీవి రామయ్య’ బయోపిక్కు భట్టికి ఆహ్వానం

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.


