News March 29, 2025

దోమల పెంట వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

image

అమ్రాబాద్ మండలం శ్రీశైలం-HYD ప్రధాన రహదారి దోమల పెంట సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. శ్రీశైలం నుంచి HYD వెళ్తున్న బీహెచ్ఈఎల్ ఆర్టీసీ బస్సు, HYD నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News April 1, 2025

చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎంపీ కావ్య

image

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల ఎల్ఓసీని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అందజేశారు. అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కడియం కావ్య అన్నారు. హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన Md. నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్‌కు వైద్య చికిత్స కోసం అందించామని వరంగల్ ఎంపీ కావ్య తెలిపారు.

News April 1, 2025

నాగర్‌కర్నూల్: ‘అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’

image

ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో పవిత్రమైన దేవాలయం వద్ద ఇలాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News April 1, 2025

ఎల్ఆర్ఎస్ ద్వారా ఇప్పటివరకు రూ.94 కోట్ల ఆదాయం: మేయర్

image

25 శాతం రిబేట్‌తో ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా సుమారు 14 వేల పాట్లను క్రమబద్దీకరించి ఇప్పటివరకు బల్దియా దాదాపు రూ.94 కోట్ల ఆదాయం సేకరించిందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నివృత్తి కౌంటర్‌ను నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్‌కు ప్రజల సందేహాలను పరిష్కరిస్తున్న తీరును పరిశీలించారు.

error: Content is protected !!