News March 13, 2025
దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్కు తరలింపు

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్తో ట్రాక్టర్కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 13, 2025
HYD సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు

ప్రపంచంలోనే HYD సెంట్రల్ యూనివర్సిటీ అత్యుత్తమ వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. లండన్కు చెందిన QS సంస్థ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. 2025కి గానూ హెచ్సీయూ 7 సబ్జెక్టుల్లో మంచి ర్యాంకింగ్ సాధించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హెచ్సీయూ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.బీజేరావు మాట్లాడుతూ.. మరింత శ్రమించి హెచ్సీయూ ఉనికిని విస్తరిస్తామన్నారు.
News March 13, 2025
బేర్స్ గ్రిప్లోకి Nifty IT: రూ.8.4లక్షల కోట్ల నష్టం

దేశీయ ఐటీ సూచీ బేర్స్ గ్రిప్లోకి జారిపోయింది. 2024, DEC 4న 45,995 వద్ద NiftyIT సూచీ ప్రస్తుతం 36,271 స్థాయికి చేరింది. 62 సెషన్లలోనే ఏకంగా 10,200 pts (22%) పతనమైంది. దీంతో ఈ ఒక్క రంగంలోనే రూ.8.4లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. TCS రూ.3.79లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.1.69లక్షల కోట్లు, HCL TECH రూ.1.21లక్షల కోట్ల మేర నష్టపోయాయి. సాధారణంగా ఏ సూచీ అయినా 20% పతనమైతే బేర్స్ గ్రిప్లోకి వెళ్లినట్టు భావిస్తారు.
News March 13, 2025
కడప: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

కడప జిల్లాలోని కాశినాయన క్షేత్రంలోని పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, కూటమి నాయకులు వాడీవేడీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించి.. తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.