News March 8, 2025
దోర్నాల: పెట్రోల్ దాడిలో ఇద్దరూ మృతి

పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో భూ వివాదం కారణంగా సైదాబీ (35), నాగూర్ వలి (23)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగూర్ వలి శుక్రవారం మధ్యాహ్నం మరణించగా, సైదాబీ రాత్రి 12:50 నిమిషాలకు మృతి చెందారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతితో విషాదం నెలకొంది.
Similar News
News December 21, 2025
ఒంగోలు: సామాన్యుడి ఒక్క ట్వీట్.. ఎంత పని చేసిందంటే?

ఒక సామాన్య వ్యక్తి చేసిన ఒక్క ట్వీట్, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గల పట్టాలపై ప్రయాణికులు దాటే పరిస్థితిని ఒకరు గమనించారు. రైలు వచ్చే క్రమంలో కూడా ప్రయాణికులు పట్టాలు దాటితే.. ఎంత ప్రమాదమో. ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేకు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక అంతే ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తనిఖీ చేసి నిన్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.
News December 21, 2025
ఒంగోలు: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి.. పూర్తి వివరాలివే!

ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హర్ష (18) ఈతకు వెళ్లి మడనూరు వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. 9 మంది స్నేహితులతో కలిసి వెళ్లిన హర్ష మడనూరు తీరం వద్దకు చేరుకోగానే మొదటగా ఇద్దరితో కలిసి తీరంలోకి వెళ్లాడు. ఒకరు అలల ధాటికీ తట్టుకోలేక బయటకు రాగా.. హర్ష, రాధాకృష్ణమూర్తి ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకున్నారు. అయితే హర్ష మృతి చెందగా.. రాధాకృష్ణను వైద్యశాలకు తరలించారు.
News December 21, 2025
ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.


