News March 19, 2024
దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Similar News
News April 2, 2025
ప్రకాశం: రేపటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం

ఒంగోలులోని డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ.కిరణ్కుమార్ తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి 150 గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 150 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 600 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 300 మంది స్పెషల్ అసిస్టెంట్స్ను తీసుకున్నామన్నారు. జిల్లాకు మొత్తం 1,90,000 పేపర్లు కేటాయించినట్లు తెలిపారు.
News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.