News March 29, 2024

దోశలు వేసిన తిరుపతి MLA అభ్యర్థి

image

తిరుపతి నగరం జీవకోనలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గురువారం ఎన్నికల నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ దుకాణంలో ఆయన స్వయంగా దోశలు వేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News January 3, 2026

పాసు పుస్తకాల్లో తప్పులుంటే అర్జీలు ఇవ్వాలి: కలెక్టర్

image

నూతనంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉంటే అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. పాసు బుక్కుల్లో తప్పులు గుర్తించిన రైతులు తహశీల్దార్ లేక వీఆర్వోలకు అర్జీలు ఇస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కాగా నూతనంగా పంపిణీ చేస్తున్న పాసు పుస్తకాల్లోనూ పలు తప్పిదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

News January 3, 2026

చిత్తూరు: రేషన్ సరకుల కోసం ఆందోళన.!

image

బియ్యం అందరికీ ఇచ్చేవరకు రేషన్ షాప్ తెరవొద్దని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలసముద్రం మండలం మణిపురం చౌకదుకాణం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ గుర్రప్ప నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

News January 2, 2026

చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

image

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.