News December 19, 2025
దోషాలను పోగొట్టే కొన్ని చిన్న అలవాట్లు

మూగ జీవులకు ఆహారం పెడితే పుణ్యఫలాలు కలుగుతాయని నమ్మకం. వాటిపై చూపే కరుణ మన దోషాలను హరిస్తుందట. ‘శునకాలకు ఆహారం ఇస్తే ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. చేపలకు గింజలు వేస్తే ఇంట్లో కలహాలు తగ్గుతాయి. పక్షులను ఆదరిస్తే దారిద్ర్యం దరిచేరదు. గోమాతకు గ్రాసం పెడితే జీవితం సంతోషంగా, తృప్తిగా ఉంటుంది. ఈ అలవాట్లు మనకు మానసిక శాంతిని ఇస్తాయి. నిస్వార్థంగా జీవులకు సేవ చేయడం భగవంతుని ఆరాధనతో సమానం.
Similar News
News December 22, 2025
హిందువులారా మేల్కోండి.. కాజల్ పోస్ట్

బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హిందువులారా మేల్కోండి. మౌనం మిమ్మల్ని రక్షించదు’ అని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘ALL EYES ON BANGLADESH HINDUS’ అని క్యాప్షన్ పెట్టారు.
News December 22, 2025
నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.
News December 22, 2025
యూరియా బుకింగ్ ఇక యాప్తో మాత్రమే

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


