News August 12, 2025

ద్రావిడ వర్సిటీ: ద.రాష్ట్రాల విద్యార్థుల కోసం దరఖాస్తులు

image

ద్రావిడ వర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాల విద్యార్థుల కోసం UG&PG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. వారికి 10 శాతం రిజర్వేషన్ కలదన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు వర్సిటీలో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News August 13, 2025

వీకోట: అదుపుతప్పి చెరువులో పడి బాలుడి మృతి

image

చెరువులో పడి ఆరో తరగతి విద్యార్ధి మృతిచెందిన సంఘటన వి.కోట మండలంలో జరిగింది. యాలకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమారుడు భార్గవ్ (11) వికోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకి వెళ్లి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.

News August 12, 2025

CTR: మూడుకు చేరిన మృతుల సంఖ్య

image

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.

News August 12, 2025

గుడికి వెళుతూ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

GD నెల్లూరు(M) పళ్లిపట్టు సమీపంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడుల కోసం కారులో బయలుదేరారు. వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.