News January 29, 2025

ద్వాకరాతిరుమల: ఫేక్ ఆర్డర్లతో మోసం

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేక్ ఆర్డర్లతో డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకా తిరుమల ఎస్సై టి. సుధీర్ వివరాలు.. రామన్నగూడెం వాసులు నాగమల్లేశ్వరరావు, నాగార్జునలను జి. కొత్తపల్లి వాసి బజారయ్య సివిల్ సప్లైలో ఉద్యాగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. 2023లో జరిగిన ఈ ఘటనలో ఒక్కొరి వద్ద రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. దీంతో 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించామన్నారు.

Similar News

News April 22, 2025

ప.గో: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి- జేసి

image

రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారితనం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లోని సమస్యలపై చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు.

News April 22, 2025

‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

image

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

News April 21, 2025

ప.గో: పీజీఆర్ఎస్‌కు 42 ఫిర్యాదులు

image

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 42 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 

error: Content is protected !!