News September 28, 2024

ద్వారకాతిరుమలలో కళ్యాణోత్సవాలు.. ఆ సేవలు నిలిపివేత

image

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణోత్సవాలు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 20 వరకు జరుగుతాయని ఆలయ అధికారులు శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణము, అర్జిత సేవలు నిలిపివేస్తామని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News October 9, 2024

ఇళ్ల నిర్మాణాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం

image

ఏలూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణాల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రోజుకు 54 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

News October 9, 2024

పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి

image

పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

News October 9, 2024

ఏలూరు: పోలవరం కుడి కాలువలో పడి ముగ్గురు మృతి

image

పెద్దవేగి మండలం కవ్వగుంటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కుడి కాలువలో పడి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. మృతులు వెంకటేశ్వరరావు (50), మణికంఠ(16), సాయికుమార్ (13)గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.