News December 15, 2025

ధనుర్మాసంలో ఆచరించాల్సిన పూజలు, వ్రతాలు

image

ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. అనేక రకాల వ్రతాలను ఆచరిస్తారు. అందులో గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రధానమైనది. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథులను పూజిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం వచ్చే మార్గశీర్ష వ్రతం మనలో సత్వగుణాన్ని పెంచుతుంది. వీటితో పాటు శ్రీవ్రతం, సిరినోములను ఆచరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఇంట్లో సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.

Similar News

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

News December 16, 2025

బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ బయటికెలా వెళ్తుంది?

image

శరీరంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ ఉంటుంది. డైట్, వ్యాయమం వల్ల కేలరీలు తగ్గించినప్పుడు శరీరం ఆ కొవ్వును ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్యాట్ కరిగి కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విడిపోతుంది. 84% కార్బన్ డై ఆక్సైడ్‌గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదా. 10కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4KGలు C02గా ఊపిరి ద్వారా, 1.6KGలు నీరుగా విసర్జింపబడతాయి.

News December 16, 2025

లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

image

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్‌తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.