News December 20, 2025
ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>
Similar News
News December 20, 2025
ఎప్స్టీన్ ఫైల్స్.. వేలాది ఫొటోలు ఎలా, ఎక్కడ చూడాలి?

అమెరికా లైంగిక నేరగాడు ఎప్స్టీన్కు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు, ఫొటోలను US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేస్తోంది. వీటిని <
News December 20, 2025
సండే ‘బడ్జెట్’!

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈసారి సెలవు రోజైన ఆదివారం(2026 FEB 1) ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 2017 నుంచి బడ్జెట్ను FEB 1న ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుండటమే దీనికి కారణం. పార్లమెంట్ సండే జరగడం అరుదైన విషయమే అయినా, ఈసారి నిర్వహించే ఛాన్స్ ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర మంత్రి రిజిజు మాట్లాడుతూ.. సరైన సమయంలో క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
News December 20, 2025
కలుపుతో వ్యవసాయానికి ముప్పు.. నివారణ ఎలా?

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కలుపు. వయ్యారిభామ, లింగ మిర్యాల, తుంగ, బంగారు తీగ సహా ఇతర కలుపు మొక్కలు పొలంలో పెరిగి.. ప్రధాన పంటకు అందించే పోషకాలను, ఎరువులను గ్రహించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి. కొన్ని వైరస్లకు ఆశ్రయమిచ్చి పంటల్లో తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వయ్యారి భామ సహా వివిధ కలుపు మొక్కల నివారణకు సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


