News December 14, 2025

ధన్వాడలో బీజేపీ అభ్యర్థి పి.జ్యోతి రామచంద్రయ్య విజయం

image

ధన్వాడ మండల కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పుట్టిన ఊరిలో బీజేపీ అభ్యర్థి పి.జ్యోతి రామచంద్రయ్య సమీప అభ్యర్థి జ్యోతిపై 617 ఓట్లు గెలుపొందారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నూతన సర్పంచ్ పి.జ్యోతి తెలిపారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోడలుపై అత్త ఎంపీ డీకే అరుణమ్మ విజయం సాధించారు. బీజేపీ పార్టీ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Similar News

News December 18, 2025

SRD: సర్పంచ్‌గా గెలిచిన ఆటో డ్రైవర్

image

కంగ్టి మండలం ముర్కుంజల్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో ఆటో డ్రైవర్ లాల్ కుమార్ అనూష ఘనవిజయం సాధించారు. గతంలో పార్టీలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడమే తన గెలుపుకు కారణమని ఆయన మద్దతుదారులు తెలిపారు. సామాన్య ఆటో డ్రైవర్‌గా ఉంటూ ప్రజాసేవపై మక్కువతో పోటీ చేసిన అనూష, సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News December 18, 2025

నెల్లూరు: 20న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

image

పల్లెపాడు డైట్ కాలేజీలో ఈనెల 20న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 38 మండలాల నుంచి గ్రూప్ కేటగిరి, విద్యార్థి కేటగిరి, ఉపాధ్యాయ కేటగిరి ప్రాజెక్టులకు సంబంధించి 114 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

HYD: ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశను మార్చింది

image

<<18569096>>శ్రీశ్రీ<<>> రచించిన ‘మహా ప్రస్థానం’ తెలుగు కవిత్వ దిశనే మార్చిన సంచలన కవితా సంకలనం. కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల ఆవేదన, ఆకలి, నిరుద్యోగంపై గర్జించే పద్యాలు ఇందులో అగ్నిజ్వాలలుగా నిలుస్తాయి. 1930లో సామాజిక కల్లోలమే ఈ కవితలకు ప్రాణం. అలంకార కవిత్వాన్ని తోసిపుచ్చి, అభ్యుదయ కవిత్వానికి బాట వేసిన గ్రంథమిది. ‘మహా ప్రస్థానానికి ముందు- తర్వాత’ అనే విభజనకు కారణమైన ఈ సంపుటి, తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయి.