News April 19, 2025

ధరణితోనే కాంగ్రెస్‌కు అధికారం: మంత్రి పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని, తొలగించి భూ భారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్‌ఛార్జి హల్చల్

image

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్‌ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్‌ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

News November 8, 2025

ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

image

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News November 8, 2025

ఖమ్మం: కోతులు, కుక్కలతో బేజారు

image

ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముదిగొండ మండలంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చిన్నపిల్లలు, మహిళలు గాయపడి ఆసత్రి పాలయ్యారని, రేబిస్ భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోకముందే వాటిని నియంత్రించాలని మండల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది.