News April 18, 2025

ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం అంటేనే అధికారంలోకి: పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భోరజ్ మండలం పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి తొలగించి భూ భారతి తెచ్చామని పేర్కొన్నారు.

Similar News

News September 10, 2025

ఆదిలాబాద్ : ఇంగ్లీష్ అధ్యాపక పోస్టుకై డెమోకు ఆహ్వానం

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం తెలిపారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 12న కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలన్నారు.

News September 10, 2025

ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 10, 2025

గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్‌ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.