News February 12, 2025

ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్‌ఐ.!

image

ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్‌పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను, డ్రైవర్‌ను హాజరుపరిచారు.

Similar News

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

‘రామాయణ’ కోసం రెహమాన్ డిజిటల్ డిటాక్స్

image

నితేశ్ తివారీ ‘రామాయణ’ సినిమాకు జిమ్మర్‌తో కలిసి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మూవీ యూనిట్‌ను పరిచయం చేయడానికి మార్చిలో ఓ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిపై ఫోకస్ చేయడానికి రెహమాన్ 40 రోజులు డిజిటల్ డిటాక్స్ పాటించనున్నట్లు ప్రకటించారు. ‘జిమ్మర్, నేను కలిసి ఓ ఐకానిక్ మ్యూజిక్ చేస్తున్నాం. అణువణువు రామాయణం, సంస్కృతిని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.

News February 17, 2026

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

image

డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో యూపీఐకి ఆప్షన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అక్కడి ఫుడ్ స్టాల్స్‌.. ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ అంటున్నాయి. UPI ఉంటుందిలే అనే ధీమాతో అక్కడికి వచ్చిన వారు చెల్లింపులకు ఇబ్బంది పడ్డారు. ఒకపక్క నో క్యాష్.. నో కార్డ్.. ఓన్లీ యూపీఐ అని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.