News February 12, 2025
ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్ఐ.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365189383_20512937-normal-WIFI.webp)
ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ను, డ్రైవర్ను హాజరుపరిచారు.
Similar News
News February 12, 2025
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737176982003_367-normal-WIFI.webp)
TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
News February 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెటితే చర్యలు: SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739367958642_51916297-normal-WIFI.webp)
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పారు. తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరమే అన్నారు.
News February 12, 2025
ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366553551_52409575-normal-WIFI.webp)
వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.