News October 8, 2025

ధరూర్: ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

image

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ధరూర్ మండలంలో పర్యటించి బడి మానేసి పొలాల్లో పని చేస్తున్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. పాతపాలెంలో పొలాల్లో పనిచేస్తున్న ఓ విద్యార్థిని గుర్తించి బడిలో చేర్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, మెరుగైన విద్య ఇవ్వాలని టీచర్లకు సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

MBNR: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు

image

మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. తొలి విడతలో 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 8, 2025

NLG: ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

నల్గొండ జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నుంచి అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని, ఎన్నికల కోడ్, 100 మీటర్ల పరిధి నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 8, 2025

రేపు చలో బస్‌భవన్‌కి కేటీఆర్ పిలుపు

image

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు చలో బస్ భవన్ పిలుపు నిచ్చింది. ఉ.9 గంటలకు రైతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజిమంత్రులు, బీఅరెస్ నేతలు ప్రయాణించనున్నారు.