News February 23, 2025
ధర్మపురిలో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్, గోధూరు, ధర్మపురి, గొల్లపల్లిలో 38.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్ 38, సిరికొండ, కొల్వాయి 37.8 మేడిపల్లి, మారేడుపల్లి 37.7 అల్లిపూర్, నేరేళ్ల, జైన 37.6 పెగడపల్లి 37.3 మల్యాల, రాయికల్ 37.2 రాఘవపేట 36.9 మెట్పల్లి 36.8 గుల్లకోట, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్ 36.7 మన్నెగూడెం 36.6 కోరుట్ల, జగిత్యాలలో 36.4℃గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News January 3, 2026
NZB: విద్యతో మహిళలకు విముక్తి దీపం: TPCC అధ్యక్షుడు

విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళి అర్పించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
News January 3, 2026
అప్పుడు రూ.1,000.. ఇప్పుడు రూ.22,000

AP: 2 నెలల క్రితం టన్ను అరటి ధర రూ.1,000కి పడిపోవడంతో కన్నీరుపెట్టిన రైతన్న ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఉమ్మడి అనంతపురంలో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మొదటి కోత టన్ను రూ.22 వేలకు చేరింది. ఎగుమతులు పెరగడం, వాతావరణం అనుకూలించడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సంక్రాంతి వేళ రైతుల మోముల్లో నవ్వులు పూస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అరటి పెద్దసంఖ్యలో సాగైంది.
News January 3, 2026
నిజామాబాద్: నే’తల’కు నొప్పి తప్పదా..?

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఈసారి భారీగా పెరగనుంది. అధికార కాంగ్రెస్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మరో వైపు బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి కూడా ఒక్కరి కన్నా ఎక్కువ మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులకు టికెట్ల కేటాయింపు తలనొప్పి కానుందనే చర్చ జరుగుతోంది.


