News October 12, 2025
ధర్మపురి: చాగంటి ప్రవచనలు.. భక్తులు మంత్రముగ్ధం

ధర్మపురి బ్రాహ్మణ సంఘం శ్రీవారి మఠం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అడ్లూరి కుమారుడు హరీశ్వర్ రూపొందించిన లక్ష్మీనరసింహస్వామి లఘుచిత్రం ప్రోమో ఆవిష్కరించారు.
Similar News
News October 13, 2025
AUS జట్టు అద్భుత ప్రదర్శన చేసింది: లోకేశ్

AP: <<17989428>>ఆస్ట్రేలియా<<>> మహిళల జట్టు వైజాగ్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఉమెన్స్ ODI క్రికెట్లో హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ ఛేజింగ్(331 రన్స్) చేసిన ఆ జట్టును అభినందించారు. ‘330 రన్స్ చేసి, ఆఖరి వరకు పోరాడిన భారత మహిళల జట్టును చూస్తే గర్వంగా ఉంది. వైజాగ్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు’ అని ట్వీట్ చేశారు. CM చంద్రబాబు కూడా AUS జట్టును అభినందించారు.
News October 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 13, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 13, 2025
జూబ్లీ సిత్రాలు: ‘Chai Lelo.. భాయ్’

జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. వెంకటగిరి ‘సండే మార్కెట్’ను అవకాశంగా భావించిన నేతలు పార్టీ కండువాలతో ప్రత్యక్ష్యమయ్యారు. చిరువ్యాపారులను పలకరించి, ఉపఎన్నికను గుర్తుచేశారు. వెంకటగిరి బస్తీలో BRS తరఫున ప్రచారం చేసిన అంబర్పేట MLA కాలేరు వెంకటేశ్కు అభ్యర్థి మాగంటి సునీత ‘లేలో భాయ్’ అని ఓ కప్పు ఛాయ్ అందించారు.