News October 22, 2025
ధర్మపురి డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎంకు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించారు. అనతంరం కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Similar News
News October 22, 2025
వరంగల్లో జాబ్ మేళా

WGL ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.కల్పన తెలిపారు. ప్రైవేటు సంస్థలో 76 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా పై చదువులు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎంపికైన వారికి రూ.15,000 వేతనం, టీఏ–డీఏ రూ.3,000 చెల్లిస్తారన్నారు. ఉదయం 11 గంటలకు బయోడేటా, సర్టిఫికేట్ జిరాక్స్లతో రావాలన్నారు.
News October 22, 2025
ధర్వేశిపురంలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు.. భక్తుల రద్దీ

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.
News October 22, 2025
భద్రాద్రి: మిగిలిన సరుకు ఎక్కడ?.. జర భద్రం

దీపావళి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 163 టపాసుల దుకాణాల్లో విక్రయాలు సాగాయి. అయితే, సుమారు 30 శాతం మేర సరకు మిగిలిపోయినట్లు సమాచారం. ఈ మిగిలిన టపాసులను విక్రయదారులు ఎక్కడ నిల్వ చేశారనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.