News February 23, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.

News February 23, 2025

INDvsPAK: భారత జట్టులో మార్పులుంటాయా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరుంటారనే చర్చ మొదలైంది. బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కుల్దీప్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ ప్లేస్‌లో యార్కర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్‌ను తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఏ ప్లేయర్ బెస్ట్? మీ కామెంట్.

News February 23, 2025

మళ్లీ ఏడాది కోర్సుగా B.Ed, M.Ed?

image

AP: బీఈడీ, ఎంఈడీ కోర్సులను తిరిగి ఏడాది కోర్సులుగా ప్రవేశపెట్టాలని NCTE యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై NCTE వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ తర్వాత ఏడాది ఫార్మాట్‌లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పదేళ్ల క్రితం B.Ed, M.Ed కోర్సులు ఏడాది పాటే ఉండగా, రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!