News February 3, 2025

ధర్మపురి: శ్రీ లక్ష్మీనరసింహుడి ఆదాయం ఎంతంటే.. 

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వివిధ కార్యక్రమాల ద్వారా అదివారం రూ.2,52,508ల  ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,092, ప్రసాదాల అమ్మకం- రూ.95,820, అన్నదానం- రూ.29,596లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.

Similar News

News February 3, 2025

విశాఖలో ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

విశాఖలో న్యాక్ ద్వారా నిరుద్యోగులకు ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసి 15-45 సం.లోపు వారికి 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టారులో ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మహారాణిపేట న్యాక్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ అందిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News February 3, 2025

కుంభమేళా భక్తుల భద్రతపై పిల్.. తిరస్కరించిన సుప్రీం

image

మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని UP ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.

News February 3, 2025

పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి

image

ఓదెల మండలం కొలనూర్‌కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.