News April 7, 2025
ధర్మవరంలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్

ధర్మవరం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈనెల 6 నుంచి 9 వరకు 15వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీంలు, 440 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 9, 2025
సిరిసిల్ల: ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

మహిళా సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఎరువులు, విత్తనాల డీలర్ షిప్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి వారితో ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
News April 9, 2025
పత్తి కొనుగోళ్లలో అగ్రస్థానంలో తెలంగాణ

TG: దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జౌళి శాఖ ప్రకటించింది. ‘ఈ ఏడాది మార్చి 31లోపు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్లను సేకరించింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(30 లక్షలు), గుజరాత్(14 లక్షలు) ఉన్నాయి’ అని వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక ఆంధ్రప్రదేశ్ 4లక్షల బేళ్ల పత్తిని సేకరించింది.
News April 9, 2025
నెక్కొండలో లక్క పురుగుల నుంచి కాపాడండి!

నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల లక్క పురుగుల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లక్క పురుగుల నుంచి తమకు కాపాడాలని కోరుతున్నారు. సంబంధిత గోధుమలను తనిఖీ చేసి నివారణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని తెలుపుతున్నారు.