News March 17, 2025
ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం.

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Similar News
News March 17, 2025
ప్రజావాణి రద్దు: జనగామ కలెక్టర్

జనగామ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దన్నారు.
News March 17, 2025
హరిపురంలో బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య

మందస మండలం హరిపురం రైల్వే స్టేషన్ సమీపాన బీహార్కు చెందిన బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బీహార్కు చెందిన సోనూ కుమార్ సాహు (28) ఆదివారం మనస్తాపంతో గురై తన గదిలో గల దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారాన్ని మందస పోలీసులకు అందించారు. మందస ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ వివరాలు సేకరిస్తున్నారు.
News March 17, 2025
పుతిన్, జెలెన్స్కీలకు సూచన చేయగలను: మోదీ

రష్యా- ఉక్రెయిన్ దేశాలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “పుతిన్తో ఇది యుద్ధానికి సమయం కాదు అని చెప్పగలను. అదేవిధంగా జెలెన్స్కీతో ఎన్ని దేశాలు నీతో ఉన్నా యుద్ధం ముగింపుకు పరిష్కారం లభించదని సూచించగలను” అని పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ ఇంటర్వూలో తెలిపారు. రెండు దేశాలు చర్చలు జరిపి పరిష్కారం వెతకాలని కోరారు. యుద్ధం వల్ల గ్లోబల్ సౌత్ నష్టపోయిందని మోడీ అన్నారు.