News November 21, 2025
ధర్మారం: పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు.. సత్కారం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా పిలిచి సత్కరించారు. SEPT 2024 నుంచి ఆయన నూతన ఆలోచనలతో నాణ్యమైన విద్య, SPC, మాసపత్రిక, రేడియో FM 674.26, ప్లాస్టిక్ రహిత పాఠశాల, మీల్స్ విత్ స్టూడెంట్స్, ప్లే ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన కమిషనర్ రాజ్ కుమార్ను అభినందించారు.
Similar News
News November 21, 2025
పెద్దపల్లి: ఐపీఎస్ అధికారి బి.రామ్ రెడ్డి బదిలీ

సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020) బదిలీ అయ్యారు. ఆయన్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఉన్న శ్రీ పి. కరుణాకర్, ఎస్పీ (ఎన్సీ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
News November 21, 2025
సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: MNCL కలెక్టర్

వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధుల దరఖాస్తులను పోలీసు, రెవెన్యూ సిబ్బంది సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు.
News November 21, 2025
MNCL:ఈనెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల23న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదిలాబాద్లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈపోటీల్లో ఎంపికైనవారు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.


