News July 11, 2024
ధర్మారెడ్డిపై విచారణ.. ఆరోపణలు ఇవే

టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. శ్రీవారి నగదు, బంగారు డిపాజిట్లను ఆయనకు అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారని విమర్శలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టుతో పాటు ఇతర దర్శన టికెట్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, తిరుపతిలో TTD నిధులతో అక్రమంగా రోడ్లు నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. తిరుమలకు వచ్చే బడాబాబుల పరిచయంతో YCPకి విరాళాలు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News September 14, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 13, 2025
చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ

చిత్తూరు SP మణికంఠ చందోలు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్లలో పని చేస్తున్న తుషార్ డూడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.