News September 9, 2024

ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన వరద ఉద్ధృతి

image

ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి నెమ్మదిస్తోంది. ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులకు చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం 3,300 క్యూసెక్కులు వాడుకొని మిగిలిన 5,21,407 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నామని అధికారులు తెలిపారు.

Similar News

News October 6, 2024

సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.

News October 5, 2024

తూ.గో.జిల్లా టుడే టాప్ న్యూస్

image

*రాజమండ్రి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా
*కాకినాడలో 8న మినీ జాబ్ మేళా
*పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నారు: సీపీఐ
*అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
*రాళ్లపాలెం: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
*డిప్యూటి సీఎంను కలిసిన మార్క్ ఫెడ్ డైరక్టర్ నరసింహరావు
*రాజమండ్రి: పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్
*తూ.గో.జిల్లా మహిళకు నారా లోకేశ్ హామీ
*గొల్లప్రోలు: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

News October 5, 2024

బాధితుడు కోలుకునేందుకు సాయం చేస్తాం: మంత్రి లోకేశ్

image

కాలేయ సమస్యతో బాధపడుతున్న రాజమండ్రి రూరల్ కాతేరు వాసి సానబోయిన రాంబాబు కోలుకునేందుకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 1982 నుంచి పార్టీ విధేయుడిగా పనిచేస్తున్న రాంబాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబానికి సాయం చేయాలని జాహ్నవి స్వామి ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో లోకేశ్ స్పందించి కార్యకర్తలే పార్టీకి ప్రాణమని అతనికి అండగా నిలుస్తామన్నారు.